Sunday, July 7, 2013

ప్రేలుళ్ళతో దద్దరిల్లిన బుద్ధగయ...

పాట్నా , జులై 7:    బీహార్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోధి ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు తో సహా ఐదుగురు  గాయపడ్డారు. ప్రేలుడు ధాటికి   ఆలయం లోని కొంత భాగం దెబ్బ తింది.   ఆలయం వెలుపల పేలకుండా ఉన్న మరో బాంబును భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2002 లో హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తింపు పొందిన మహాబోధి ఆలయం ఉగ్రవాదుల హిట్ లిస్టు లో ఉన్నట్టు సమాచారం. ఇక్కడ సాధారణంగా సెప్టెంబర్ నుంచి పర్యాటకుల రద్ది ఎక్కువగా ఉంటుంది.      


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...