Wednesday, July 10, 2013

ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్...

 పోర్ట్ ఆఫ్ స్పెయిన్ , జులై 10:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై భారత జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించి, ఫైనల్లోకి దూసుకెళ్లింది.  టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్ చేపట్టింది. మ్యాచ్ 29 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురియడంతో ఆటను నిలిపివేశారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలుగడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ 26 ఓవర్లకు కుదించి శ్రీలంక జట్టుకు 178 పరుగుల లక్ష్యాన్నినిర్ణయించారు. అయితే భారత భౌలర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించి 4 వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక జట్టు 24.4 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది.  భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...