Sunday, July 28, 2013

కిరణ్ తప్పుకున్నట్టేనా....?

న్యూఢిల్లీ, జులై 28: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  తన రాజీనామా లేఖను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో పెట్టినట్లు  ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేముందు ఆయన రాష్ట్ర విభజనలో తాను భాగస్వామిని కాలేనంటూ చెప్పి  తన రాజీనామా లేఖను సోనియాకు ఇచ్చినట్లు  చెబుతున్నారు.  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా లేఖ ప్రస్తుతం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ వద్ద ఉందంటున్నారు.  ముఖ్యమంత్రి శనివారంనాడు సచివాలయానికి వెళ్ళలేదు.  హెలికాప్టర్‌లో నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభకు మాత్రం వెళ్ళారు. కాగా  కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ శానససభను సస్పెండ్ యానిమేషన్‌లో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించి,  రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేస్తారని అంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి  అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...