Tuesday, July 16, 2013

' కోర్ ' వివరాలు వెల్లడించలేం....దిగ్విజయ్

న్యూఢిల్లీ, జులై 16: తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివేదికను బయటపెట్టేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే కోర్ గ్రూప్ సమావేశంలో చర్చించిన విషయాలను బయటకు చెప్పబోమని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలేనని, ఈ విషయంపై అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ఈ దశలో వెల్లడించలేమని ఆయన అన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణా పై నిర్ణయం జరుగుతుందని  దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాలకు చెందిన నేతల వాదనలు బలంగా ఉన్నాయని దిగ్విజయ్ అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...