Sunday, July 14, 2013

బ్రహ్మాస్త్రంతో విభజనను ఆపుతాం...లగడపాటి

హైదరాబాద్  , జులై 14:  రాష్ట్రం చీలిపోకుండా బ్రహ్మాస్త్రంతో ఆపే శక్తి తమకు ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.   రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.2004, 2009 ఎన్నికల్లో ప్రజలు సమైక్యవాదానికే ఓటేశారని, మూడోసారి కూడా అధికారం తమదేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ బికారి అవుతుందని ఆయన అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేవారే ప్రజలను విడదీస్తారని, కాంగ్రెసు అలాంటి పనిచేయదని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. శాసనసభలో తీర్మానం చేసిన తర్వాతనే బిల్లు పార్లమెంటుకు వస్తుందని ఆయన చెప్పారు. విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణపై ఈ నెలాఖరు లోపు నిర్ణయం వస్తుందని ఆయన చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...