దుబాయ్,జూన్ 9: సౌదీ అరేబియాలో దాదాపు రెండువందల మంది భారత కార్మికులు ఇద్దరు బంగ్లా రిక్రూట్మెంట్ ఏజెంట్ల చేతిలో మోసపోయారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలోని అధికారులకు, సామాజిక కార్యకర్తలకు తమ పరిస్థితిపై వారు ఫిర్యాదు చేయడంతో, బంగ్లా ఏజెంట్లు వారిపై దాడికి పాల్పడ్డారు. బంగ్లా ఏజెంట్లు ఐదుగురు కిరాయి మనుషుల చేత తమపై దాడి జరిపించారని బాధితులు ఆరోపించారు. పైగా, పనిలోకి రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లకు చెందిన దాదాపు రెండువందల మంది కార్మికులు ముంబైకి చెందిన లేబర్ ఏజెన్సీ ఫహాద్ ఎంటర్ప్రైజెస్కు రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల చొప్పున చెల్లించి సౌదీ వచ్చారు. వివిధ పారిశ్రామిక సంస్థల్లో వారిని చిల్లర పనుల్లో నియమించి, బలవంతంగా పనిచేయిస్తూ వచ్చారు. పనుల్లో చేరి రెండు నెలలైనా ఎలాంటి వేతనాలూ చెల్లించలేదు.
.
.
No comments:
Post a Comment