Tuesday, June 11, 2013

అలక వీడిన అద్వానీ...

న్యూఢిల్లీ, జూన్ 11: బిజెపిలో సంక్షోభం ముగిసింది. అద్వానీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. అద్వానీతో పార్టీ సీనియర్ నేతల సమావేశం  అనంతరం అద్వానీ నివాసంలోనే రాజ్ నాథ్ విలేకరులతో మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్. అధినేత  మోహన్ భగవత్ సూచన మేరకే అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పినట్లు తెలిపారు. పార్టీ పట్ల అద్వానీకి ఉన్న అభ్యంతరాలను వెంటనే పరిశీలిస్తామని చెప్పారు. త్వరలో బిజెపి పార్లమెంటరీ సమావేశం జరుగుతుందన్నారు. అద్వానీ చెప్పిన అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అయితే ఈ విలేకరుల సమావేశం తన నివాసంలో జరిగినప్పటికీ అద్వానీ హాజరుకాలేదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...