ముంబయి,జూన్ 11 : రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్ బలపడుతున్న కొద్దీ రూపాయి విలవిలలాడిపోతోంది. నిన్న జీవితకాల కనిష్టస్థాయిని తాకిన రూపాయి ఇవాళ మరో 20 పైసలు నష్టపోయింది. ఉదయం 58 రూపాయల 35 పైసలకు సమీపంలో ట్రేడయింది. గత ఏడాది జూన్లో రూపాయి 57 రూపాయల 32 పైసలను తాకి కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ రికార్డును అధిగమించి తాజాగా కొత్త కనిష్టస్థాయికి పడిపోయింది. డాలర్లకు భారీగా డిమాండ్ వస్తుండటంతో రూపాయిపై ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. 54 నుంచి శరవేగంగా 58కి పడిపోవడంతో దిగుమతి చేసుకునే కంపెనీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ రూపాయి క్షీణతపై మాట్లాడుతూ... తాము కరెన్సీ రేట్లలో జోక్యం చేసుకోబోమని, ఒక నిర్దిష్ట శ్రేణి లేదా స్థాయిలో రూపాయి విలువ ఉండాలనేమీ మేం లక్ష్యంగా పెట్టుకోలేదని తేల్చిచెప్పారు. అయితే, భారీగా హెచ్చుతగ్గులుంటే స్థిరీకరణ కోసం జోక్యంచేసుకుంటామని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment