జోహన్నెస్బర్గ్, జూన్ 9: జాతివివక్ష వ్యతిరేకోద్యమ యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా
( 94) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రిటోరియా ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం నిలకడగానే ఉందని, వైద్యులు అవసరమైన చికిత్సలన్నీ చేస్తున్నారని దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ప్రతినిధి తెలిపారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ తిరగబెట్టడంతో మండేలాను ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు గత ఏడు నెలల్లో ఈ ఇన్ఫెక్షన్ రావడం ఇది మూడోసారి. గత ఏడాది డిసెంబర్లో ఇన్ఫెక్షన్కు 18 రోజులు చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వైద్యులు ఆపరేషన్ చేసి పిత్తాశయంలోని రాళ్లను తొలగించారు. మండేలా కొన్ని దశాబ్దాల కిందట జైల్లో ఉన్నప్పుడు క్షయ సోకింది. అప్పటినుంచి ఆయన తరచూ ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.
( 94) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రిటోరియా ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం నిలకడగానే ఉందని, వైద్యులు అవసరమైన చికిత్సలన్నీ చేస్తున్నారని దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ప్రతినిధి తెలిపారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ తిరగబెట్టడంతో మండేలాను ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు గత ఏడు నెలల్లో ఈ ఇన్ఫెక్షన్ రావడం ఇది మూడోసారి. గత ఏడాది డిసెంబర్లో ఇన్ఫెక్షన్కు 18 రోజులు చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వైద్యులు ఆపరేషన్ చేసి పిత్తాశయంలోని రాళ్లను తొలగించారు. మండేలా కొన్ని దశాబ్దాల కిందట జైల్లో ఉన్నప్పుడు క్షయ సోకింది. అప్పటినుంచి ఆయన తరచూ ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.
No comments:
Post a Comment