Friday, June 14, 2013

మొయిలీని ఆయిల్ కంపెనీల లాబీలు బెదిరిస్తున్నాయట...

న్యూఢిల్లీ, జూన్ 14 : ఆయిల్ కంపెనీల లాబీల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే  ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగేది లేదని  తేల్చిచెప్పారు. రాబడులు బయటకు వెళ్లిపోవడం వల్ల    దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారిని బెదిరిస్తున్నారని మొయిలీ చెప్పారు. దేశీయంగా చమురు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ప్రజల ఆదాయం అంతా చమురు దిగుమతులకే వెళ్లిపోతుందన్నారు. ఇది దేశానికి మంచిదికాదని ఆయన పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...