Monday, May 20, 2013

ధర్మాన , సబిత అవుట్...

 హైదరాబాద్, మే 20:   సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఈ  మంత్రులు దాదాపు 20 నిమిషాలపాటు ఆయనతో సమావేశమై రాజీనామాలు సమర్పించి తిరుగుముఖం పట్టారు. సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి రాగా, ధర్మాన మాత్రం తన సిబ్బందితో కలిసి వచ్చారు. వాస్తవానికి సీబీఐ అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రుల రాజీనామా తప్పదని ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడటం.. ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో సైతం కేంద్రంలో మాదిరిగానే రాష్ర్టంలోని మంత్రులు కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో  ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి రాజీనామల నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. సీబీఐ అభియోగాలు మోపినప్పుడే రాజీనామా చేశామని, అప్పుడే వాటిని ఆమోదిస్తే తమకు గౌరవమైనా దక్కేదని, అలా కాకుండా అవమానకర రీతిలో తమను సాగనంపుతున్నారని మంత్రులు వాపోయినట్టు భోగట్ట. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తో పాటు  రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు.. ధర్మాన, సబితలకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. 
.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...