Friday, April 19, 2013

భద్రాద్రిలో కళ్యాణ వైభోగం...

ఖమ్మం, ఏప్రిల్ 19 : శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి లోని మిథిలాస్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.  ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా స్టేడియంకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  అభిజిత్ లగ్నంలో  వేదపండింతులు మాంగల్య ధారణ కావించారు. టీటీడీ తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకై రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి పోటెత్తారు.  కేంద్ర మంత్రి బలరాంనాయ్, మంత్రులు సి.రామచంద్రయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...