Monday, March 25, 2013

అమెరికాలో భారత సంతతి విద్యార్థి అదృశ్యం

వాషింగ్టన్, మార్చి 25: అమెరికాలో సునీల్ త్రిపాఠీ (22) అనే భారత సంతతి విద్యార్థి కొద్ది రోజులుగా అదృశ్యమయ్యాడు. రోడ్ ఐలాండ్ పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నా, ఫలితం లేకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ స్వయంగా రంగంలోకి దిగింది. బ్రౌన్ వర్సిటీలో చదువుకుంటున్న త్రిపాఠీ మార్చి 16 నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసులతో పాటు అతడి మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆచూకీ కోసం పోస్టర్లు ముద్రించడంతో పాటు ‘ఫేస్‌బుక్’లో ప్రత్యేకంగా ఒక పేజీని కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు అతడి ఆచూకీపై గట్టి ఆధారాలేవీ లభించలేదని డిటెక్టివ్ బృందం అధినేత మార్క్ సాకో చెప్పారు. త్రిపాఠీ గదిలో అతడి గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్, ఇతర వ్యక్తిగత వస్తువులు దొరికాయని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...