Monday, March 25, 2013

వర్కవుట్ అవుతుందా...?

హైదరాబాద్, మార్చి 25:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర  ఆదివారంతో  వంద రోజులకు చేరింది.  గత  అక్టోబర్ 18వ తేదిన కడప జిల్లా ఇడుపులపాయ నుండి పాదయాత్రను ప్రారంభించిన షర్మిల. 58 రోజుల పాదయాత్ర తర్వాత మోకాలి గాయం కారణంగా విరామం ఇచ్చారు. చికిత్స అనంతరం ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్రను పునఃప్రారంభించారు. మొత్తం యాత్రలో భాగంగా షర్మిల ఇప్పటి వరకు 1,375 కిలోమీటర్లు నడిచారు.  ఏడు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టారు. ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా లో పాదయాత్ర చేస్తున్నారు.  జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీ పటిష్టత కోసం ఆమె పాదయాత్ర చేపట్టారు.  అయితే ఎన్నికల రణరంగంలో ఈ యాత్ర ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...