న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: తెలంగాణపై సంప్రదింపులు అవసరమని, వాటిని తాము కొనసాగిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణపై చర్చలకు ఎలాంటి తుది గడువు లేదని తేల్చి చెప్పారు. తెలంగాణపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తమకూ ఉందని, కానీ, ఈ అంశం ఇంకా ముగిసిపోలేదని అన్నారు. అఫ్జల్ ఉరి గురించి అతని కుటుంబానికి ముందే సమాచారమందించామని, సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం సరికాదని షిండే అన్నారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను షిండే ఖండించారు. అఫ్జల్ ఉరి విషయాన్ని తానే స్వయంగా ఈ నెల 8వ తేదిన ఓమర్కు చెప్పానని షిండే చెప్పారు. రాజీవ్, పంజాబ్ మాజీ సిఎంల కేసులు సుప్రీం కోర్టులో ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ల ఉరి రాజకీయపరమైన నిర్ణయాలు కావన్నారు. చట్టం సూచనల మేరకు, నిబంధనల ప్రకారమే ఉరి అమలు జరిగిందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment