Thursday, November 15, 2012

రాహుల్ నాయకత్వంలో ఎన్నికల సమన్వయ కమిటీ

న్యూఢిల్లీ, నవంబర్ 15:  రాహుల్ గాంధీ నేతృత్వంలో 2014 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా రాహుల్ నాయకత్వంలో ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో అహ్మద్ పటేల్, మధుసూదన్ మిస్త్రీ, అహ్మద్ పటేల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ సభ్యులుగా ఉంటారు.ఎన్నికల కోసం మరో రెండు సబ్ కమిటీలను పార్టీ నియమించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది తెలిపారు. ఎన్నికలకు ముందే పొత్తుల ఖరారు కోసం ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఓ సబ్ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచార, ప్రచార సబ్ కమిటీకి దిగ్విజయ్ సింగ్ సారథ్యం వహిస్తారని వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...