Friday, October 26, 2012

మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు...

చిరు, కోట్ల, బలరాం నాయక్ లకు కేంద్రంలో చోటు...?
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఆదివారం జరిగే అవకాశం ఉన్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో  రాష్ట్రం నుంచి  రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తో పాటు , కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్‌లకు బెర్తులు ఖరారయినట్టు సమాచారం.  వారి ముగ్గురికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించింది. సామాజిక వర్గం, తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో  వీరిని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.  ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలోచిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామనే హామీ ఉంది. అందుకే ఆయన తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికయ్యారు.ఇక కర్నూలుతో పాటు సీమ జిల్లాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, తెలంగాణ ప్రాంతంలో ఎస్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున . ఆ వర్గాన్ని  ప్రభావితం చేస్తారనే భావనతో బలరాం నాయక్‌ను  మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. దీనితో   మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందని కూడా  అదిస్థానం భావనట... 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...