Tuesday, September 11, 2012

పరుగు తేడాతో ఓడిన భారత్

రీ ఎంట్రీలో రాణించిన  యువరాజ్   
చెన్నై,సెప్టెంబర్ 11:  చెన్నైలో జరిగిన ట్వంటీ 20 పోరులో ధోనీ సేన ఒకే ఒక పరుగుతో కివీస్ చేతిలో ఓటమి పాలైంది.  న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. విజయానికి 168 పరుగులు చేయాల్సి ఉండగా చివరలో వికెట్లను కోల్పోయి మ్యాచ్ ను జారవిడుచుకుంది. న్యూజిలాండ్ బ్యాట్శ్మెన్‌లో మెక్‌కుల్లం 67 బంతుల్లో 91 పరుగులు చేశాడు.  భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీయగా, జహీర్ ఖాన్, బాలాజీ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ గౌతం గంభీర్ వికెట్‌ను తొందరగా కోల్పోయింది. 12 బంతులకు 3 పరుగులు చేసి ఓపెనర్ గౌతం గంభీర్ అవుటయ్యాడు. టెస్టు మ్యాచుల్లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ ట్వంటీ20 మ్యాచులోనూ తాను తక్కువ కాదని నిరూపించుకున్నాడు. 67 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. యువరాజ్ సింగ్ తన రీ ఎంట్రీలో  26 బంతుల్లో 34 పరుగులు చేశాడు. యువీతో కలిసి ఆడిన కెప్టెన్ ధోనీ 23 బంతులలో  22 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. యువీ అవుట్‌ తోనే మ్యాచ్ కివీస్‌కు అనుకూలంగా మారిపోయింది. బౌలింగ్ కూడా చేసిన  యువీ  రెండు ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చాడు. కానీ వికెట్లుచిక్కలేదు.న్యూజిలాండ్ బౌలర్లలో మిల్స్, ఫ్రాంక్లిన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...