భద్రతా వలయంలో భాగ్యనగరం...

నిమజ్జనం...తెలంగాణా మార్చ్...జీవ వైవిధ్య సదస్సు...   
హైదరాబాద్,సెప్టెంబర్ 26:  హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి తెలంగాణ మార్చ్ సెగ తగిలింది. 30న తెలంగాణ మార్చ్  ను     దృష్టిలో పెట్టుకుని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ  రాత్రి 11 గంటల లోపలే ముగించాలని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశించారు.  తెలంగాణ మార్చ్ కు అనుమతి లేదని ఆయన చెప్పారు. బయటివారు తెలంగాణ మార్చ్ లో పాల్గొనకూడదని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు  మార్చ్ ను వాయిదా వేసుకుంటే ఆ తర్వాత  అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. అయితే, మార్చ్ ను వాయిదా వేసుకోవడానికి తెలంగాణ జెఎసి నిరాకరించింది.  వినాయక నిమజ్జనానికి తమ మార్చ్ ఏ విధమైన విఘాతం కలిగించదని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. మరోవైపు మార్చ్  ను అడ్డుకోవడానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరానికి జిల్లా నుంచి వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టారు.  భద్రత  కోసం 20 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాదులో జరిగే జీవ వైవిధ్య సదస్సు బందోబస్తుకు పారా మిలిటరీ బలగాలు రావాల్సి ఉంది. కానీ, వినాయక నిమజ్జనం, తెలంగాణ మార్చ్ సందర్భంగా ముందుగానే వాటిని తరలిస్తున్నారు.   

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు