అట్లాంటా, సెప్టెంబర్ 25: యూటీ ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా నిర్వహిస్తున్న తెలుగు బోధనా తరగతులకు కావలసిన నిధుల సమీకరణకు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పద్మశ్రీ చిత్ర ల సంగీత విభావరి గత శనివారం సాయంత్రం డాలస్ లోని బ్లాక్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో ఘనంగా జరిగింది. డాలస్ లో ఉంటున్న భారతీయులతోపాటు టెక్సస్ లోని ఇతర ప్రాంతాల నుండి, ఒక్లొహోమా నుంచి కూడా తెలుగు భాషాభిమానులు, సంగీతాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంగీత డోలికల్లో తేలియాడారు. జగదానందకారకా, ఉప్పొంగెలే గోదావరి పాటలతో మొదలుపెట్టి యమహో నీ యమాయమా, స్వప్నవేణువేదొ, మాటేమంత్ర్రమూ, తెలుసామనసా, రాసలీలవేళ మొదలైన హిట్ పాటలతో పాటు, అలనాటి మధురగీతాలైన ఏదివిలో విసిసిన పారిజాతమో, సువ్వేనా సంపెంగపువ్వుల నువ్వేనా, తదితర బాలు పాటలు అందరినీ మంత్రముగ్ధులను చేసాయి.యస్పీశైలజ, ఎస్.పి. చరణ్ కూడా మధుర గీతాలు ఆలపించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment