న్యూఢిల్లీ: సెప్టెంబర్ 17: ఈ నెలఖారుకల్లా తెలంగాణాపై స్పష్టత ఇచ్చే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. తెలంగాణా అంశంపై ఈ నెల 21 తేదీన యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కొన్ని రోజులు ఢిల్లీలో ఉండాలని అధిష్టానం కోరినట్టు తెలిసింది. ఈలోగా కేసీఆర్ మరోసారి వయలాల్ రవి, ఆజాద్లతో భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో సోనియా గాంధీ సోమవారం సాయంత్రం అత్యవసరంగా జరిపిన సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, ఆంటోనీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై గంటకు పైగా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వాయలార్ రవి చైనా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 22వ తేదీన కెసిఆర్తో చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణపై ఈ నెల 21వ తేదీన యుపిఎ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీలోగా తెలంగాణ అంశాన్ని తేల్చేయడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. కెసిఆర్ ఈ నెల 5వ తేదీ నుంచి ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెసు పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి వాయలార్ రవితో ఆయన చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు వస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి తాను సిద్ధమేనని ఆయన చెబుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వకపోతే జరిగే నష్టం గురించి ఆయన కాంగ్రెసు పెద్దలకు వివరిస్తున్నట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment