హైదరాబాద్, ఆగస్ట్ 9: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం తిరస్కరించింది. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్ను స్వీకరించిన సుప్రీం కోర్టు గురువారం విచారించింది. జగన్కు బెయిల్ ఇవ్వడం పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా చెప్పాలని సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో రెండో నిందితుడుగా ఉన్న విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ వేసిన మరో పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు విజయ సాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్ పై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment