న్యూఢిల్లీ, ఆగస్ట్ 8: ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కోపం వచ్చింది. బుధవారం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో యూపిఏ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత అద్వానీ చేసిన వ్యాఖ్య పై ఆమె తీవ్రంగా స్పందించారు. అద్వానీ చేసిన వ్యాఖ్యలపై సోనియా మండిపడటమే కాకుండా యూపిఏ ఎంపీలంతా నిరసన తెలపాలని సూచించారు. అంతే కాకుండా అద్వానీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేవరకు పట్టుబట్టారు. అసోం అల్లర్లపై అద్వానీ మాట్లాడుతూ అక్రమ చొరబాట్లను యూపిఏ ప్రభుత్వం అరికట్టలేకపోవడం వల్లనే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. అసోంలో అల్లర్లు హిందూ, ముస్లింలకు సంబంధించినవి కావని, భారతీయులకు, విదేశీయులకు మధ్య జరుగుతున్నవని చెప్పారు. అంతటితో ఆగక యూపిఏ ప్రభుత్వంపై అద్వానీ మరిన్ని విమర్శలు గుప్పించారు. అధికారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన యూపిఏ ప్రభుత్వానికి చట్టబద్దత లేదని వ్యాఖ్యలు చేశారు. దాంతో అద్వానీ సోనియా గాంధీ మండిపడ్డారు. అద్వానీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అద్వానీ తప్పులు చెబుతున్నారంటూ ఆగ్రహంతో చేతిలోని పెన్సిల్తో టేబుల్పై కొట్టారు. ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు దూకండంటూ యుపిఏ ఎంపీలను పురికొల్పారు. సోనియా తీవ్ర భావోద్వేగాలతో కదిలిపోయారు.పలుమార్లు ఆమె సహచర సభ్యులకు సూచనలిస్తూ.... అనేకసార్లు సైగలు చేశారు. ఆమె పలుమార్లు ప్రతిపక్షం వైపు చేయి చూపిస్తూ మీరిలా చేస్తే సహించేది లేదన్నారు. దీనితో అద్వానీ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గొడవ చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ దశలో మీరాకుమార్ జోక్యం చేసుకునివ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అద్వానీకి హితవు చెప్పారు. దాంతో ఆయన కొద్దిసేపు బెట్టు చేసినా ఆ తరువాత మీరాకుమార్ సలహా మేరకు యుపిఏ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సోనియా హావభావాలు, కదలికలు సభలో మొయిలీ సహా పార్టీ సీనియర్ నేతలను విస్మయ పరిచాయి. ఎనిమిదేళ్లుగా యూపీఏకు నేతృత్వం వహిస్తున్న సోనియా ఇన్నేళ్ల కాలంలో ఏనాడూ ఇంత ఆగ్రహంగా ఉండడం చూడని ఎంపీలు మరింత ఉత్సాహంతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment