Friday, May 11, 2012

చంద్రబాబు ఆస్తులపై సుప్రీంకోర్టులో వైఎస్ విజయమ్మ పిటిషన్

హైదరాబాద్ మే 11:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల వ్యవహరంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో సహా 17 మందికి సంబంధించిన అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో విజయమ్మ పేర్కోన్నారు. 45 పేజీలు ఉన్న పిటిషన్‌ను విజయమ్మ దాఖలు చేశారు. 14 పేజిలలో కారణాలను వివరించారు. శనివారం నుంచి సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు కావడంతో.. సెలవుల అనంతరం వైఎస్ విజయమ్మ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు ఆస్తుల అంశంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఒక బెంచ్ విచారణకు ఆదేశించగా.. అదే తరుణంలో మరో బెంచ్ కొట్టివేసిందని.. ఇది సరైనదేనా అని విజయమ్మ ప్రశ్నించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...