హైదరాబాద్ మే 11: తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ పదవికి ప్రజా గాయకుడు గద్దర్ రాజీనామా చేశారు. 18 నెలల క్రితం గద్దర్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. రాజ్యానికి, రాజ్య హింసకు వ్యతిరేకంగా తాను దేశవ్యాప్తంగా ప్రచారం సాగిస్తానని గద్దర్ చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలు కోరుకునేవారిని ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.ఈ నెల 20వ తేదీన జరిగే ప్రజా ఫ్రంట్ కార్యవర్గ సమావేశంలో కొత్త చైర్మన్ను ఎన్నుకుంటారు. రాజ్యానికి, రాజ్య హింసకు వ్యతిరేకంగా తాను దేశవ్యాప్తంగా ప్రచారం సాగిస్తానని గద్దర్ చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలు కోరుకునేవారిని ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. దోపిడీని ఎదిరించడానికి తాను ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన ఉద్యమం వల్ల తెలంగాణ సాధించలేకపోయామని, తెలంగాణ సాధనకు ఉద్యమ రూపం మారాల్సి ఉందని, ఉద్యమాన్ని యుద్ధంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఇప్పటి వరకు జరిగినవి నిరసన ఉద్యమాలు మాత్రమేనని, అవి తెలంగాణ సాధనకు సరిపోలేదని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను భాగస్వాములను చేయకుండా తెలంగాణ రాదని, తెలంగాణకు అనుకూలంగా జరుగుతున్న ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తాను ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment