భువనేశ్వర్,ఏప్రిల్ 19: : భారత్ తొలిసారిగా ఖండాతర క్షిపణి అగ్ని-5 ని ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించింది. భారత్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిముషాలకు ఈ ప్రయోగం జరిగింది. అగ్ని-5 క్షిపణి లక్ష్యం వైపు విజయవంతంగా దూసుకువెళుతోంది. అగ్ని-5 ప్రయోగంతో ఖండాతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది. అంతర్జాతీయ రక్షణ వ్యవస్థల తీరుతెన్నులను మార్చగలదని భావిస్తున్న ఈ ప్రయోగాన్ని ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాలతో పాటు మరికొన్ని కీలక రంగాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం కఠోరంగా శ్రమించారు. నిర్దేశించిన లక్ష్యాలపై పడి విధ్వంసం సృష్టించడం ఒక్కటే కాకుండా భారతదేశ రక్షణావసరాలకు తగ్గట్టుగా బహుముఖ సేవలందించగల బ్రహ్మాస్త్రంగా అగ్నిని మలచారు. సుమారు 50 టన్నుల బరువు, 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోతూ ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment