Wednesday, April 18, 2012

భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం...

భువనేశ్వర్,ఏప్రిల్ 19: : భారత్ తొలిసారిగా ఖండాతర క్షిపణి అగ్ని-5 ని ఒడిషాలోని వీలర్‌ ఐలాండ్‌ నుంచి ప్రయోగించింది. భారత్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిముషాలకు ఈ ప్రయోగం జరిగింది. అగ్ని-5 క్షిపణి లక్ష్యం వైపు విజయవంతంగా దూసుకువెళుతోంది. అగ్ని-5 ప్రయోగంతో ఖండాతర క్షిపణి రక్షణ వ్యవస్థ  ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది.  అంతర్జాతీయ రక్షణ వ్యవస్థల  తీరుతెన్నులను  మార్చగలదని భావిస్తున్న ఈ ప్రయోగాన్ని ప్రపంచ దేశాలన్ని  ఆసక్తిగా గమనిస్తున్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాలతో పాటు మరికొన్ని కీలక రంగాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం కఠోరంగా శ్రమించారు. నిర్దేశించిన లక్ష్యాలపై పడి విధ్వంసం సృష్టించడం ఒక్కటే కాకుండా భారతదేశ రక్షణావసరాలకు తగ్గట్టుగా బహుముఖ సేవలందించగల బ్రహ్మాస్త్రంగా అగ్నిని మలచారు. సుమారు 50 టన్నుల బరువు, 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోతూ ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...