Monday, April 9, 2012

కంటితుడుపుగా కరెంట్ చార్జీలు తగ్గింపు

హైదరాబాద్, ఏప్రిల్ 9: విద్యుత్ ఛార్జీలను   రు. 4400 కోట్ల మేర పెంచిన  ప్రభుత్వం కంటితుడుపు గా  రు.  175 కోట్ల మేర  తగ్గించింది.  కేవలం ఒకే ఒక స్లాబ్‌కు నామమాత్రం ఊరట నిచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఇక ఛార్జీల తగ్గింపు సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలోని 47 లక్షల గృహాలకు విద్యుత్ చార్జీల పెంపు భారం తగ్గ్గుతుందని  ఆయన తెలిపారు.విద్యుత్ చార్జీలు పెంచడం తనకు కూడా బాధగానే ఉందని, అయితే తప్ప లేదని ముఖ్యమంత్రి  అన్నారు. విద్యుత్ వినియోగం కన్నా ఉత్పత్తి తక్కువగా ఉందని  చెప్పారు. రోజుకు 42 మిలియన్ యూనిట్ల కొరత ఉందని ఆయన చెప్పారు.  విద్యుత్ కొనుగోలుకు రూ. 200 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కొనుగోలు ధర రూ.1.15 పైసల నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆయన అన్నారు. మే మాసానికల్లా విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు అదనపు విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని, దాంతో విద్యుత్తు కోతను నివారిస్తామని ఆయన చెప్పారు. సింహాద్రి నుంచి త్వరలో 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...