Monday, April 9, 2012

తిరుపతి తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ

హైదరాబాద్, ఏప్రిల్ 9: చిరంజీవి రాజినామా వల్ల తిరుపతి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు  తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ కృష్ణ మూర్తిని  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. చదలవాడ 2009 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెసులో ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెసు పార్టీలో ఉంటూనే అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గెలుపు కోసం కృషి చేశారనే ఆరోపణలున్నాయి. కాగా, చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుండి సోమవారం ప్రారంభించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...