తిరుపతి తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ

హైదరాబాద్, ఏప్రిల్ 9: చిరంజీవి రాజినామా వల్ల తిరుపతి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు  తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ కృష్ణ మూర్తిని  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. చదలవాడ 2009 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెసులో ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెసు పార్టీలో ఉంటూనే అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గెలుపు కోసం కృషి చేశారనే ఆరోపణలున్నాయి. కాగా, చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుండి సోమవారం ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు