ఆసియాకప్లో భారత్ శుభారంభం
మీర్పూర్,మార్చి 13: ఆసియాకప్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. 305 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులు 254 పరుగులకు ఆలవుట్ అయ్యారు. ఆదిలోనే దిల్షాన్ 7 పరుగులకే అవుటయ్యి అభిమానులను నిరాశ పరిచాడు. అనంతరం జయవర్ధనే సూపర్ ఇన్నింగ్స్, సంగక్కరా అద్భుత ఇన్నింగ్స్ లంకను గెలించలేకపోయాయి. అనంతరం మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో లంక ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, వినయ్ కుమార్, అశ్విన్లు తలో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. కొహ్లి (108), గంభీర్ (100) సెంచరీలు సాధించారు. సచిన్ 6 పరుగులు చేశాడు. ధోనీ 46, రైనా 30 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. లంక బౌలర్లలో మహరూp 2 వికెట్లు పడగొట్టాడు. లక్మాల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Comments