కోతలకు తోడు ఇక వాతలు...
హైదరాబాద్,మార్చి 30: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 50 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.1.45 పైసలు,100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు, 200 యూనిట్ల వరకు రూ.3.60 పైసలు పెంచారు. పెంపు వల్ల వినియోగదారులపై 3434.89కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,985.23 కోట్లు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం గృహావసరాలకు రూ.1736 కోట్లు, వ్యవసాయానికి రూ.3,620 కోట్లు, ఇరిగేషన్కు రూ.1.56 కోట్లు మొత్తం రూ.5,358.67 కోట్లు సబ్సిడీ ఇస్తుంది.

Comments