రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి షరా మాములే...
న్యూఢిల్లీ,మార్చి 14: రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం షరా మాములే. హైదరాబాద్ ఎంఎంటిఎస్ రెండో దశకు గత బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామన్న హామి, కాకినాడ - విశాఖ కారిడార్లో రైల్వే లైన్ల అభివృద్ధి ప్రతిపాదన మినహా చెప్పుకో దగ్గ విశేషమేదీ లేదు. కాకినాడ - విశాఖ తీర ప్రాంత రైల్వే లైన్ల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడతారట. కాకినాడ - పిఠాపురం ప్రాజెక్టును ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టడానికి భూమిని, నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని రైల్వే మంత్రి చెప్పారు. మెదక్ - అక్కన్నపేట, భద్రాచలం - కొవ్వూరు మధ్య రైల్వే లైన్లను ఏర్పాటు ను కూడా బడ్జెట్ లో ప్రతిపాదించారు.
Comments