మినీ సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం...

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు
న్యూఢిల్లీ,డిసెంబర్ 24: 2014 సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు రిహార్సల్ గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం  ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్‌లో వచ్చే ఏడాది జనవరి 30న, మణిపూర్‌లో జనవరి 28న, గోవాలో మార్చి 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరపనుంది. అయితే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి నాలుగున  ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 8, 11, 15, 19, 23, 28 తేదీల్లో మిగతా విడత ఎన్నికలుంటాయి. మార్చి 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి తెలిపారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు