హైదరాబాద్,డిసెంబర్ 23: : ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి (82) ఈ ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారథి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు రాశారు.. ఎన్టీఆర్-బి.విఠలాచార్య కాంబినేషన్లో బందిపోటు చిత్రంతో రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్-కృష్ణ కాంబినేషన్లో వచ్చిన నిలువుదోపిడి, దేవుడు చేసిన మనుషులురాలకు మహారథి సంభాషణలు అందించారు. కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాకోసం మహారథి అనేక సినిమా ఆఫర్లను వదులుకుని తపస్సులా రచన చేశారు. పెత్తందారులు, కంచుకోట, దేశోద్ధారకులు, పాడిపంటలు, ప్రజారాజ్యం సినిమాలకు కూడా సంభాషణలు రాశారు. త్రిలింగ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కృష్ణ నటించిన శాంతి సందేశం చిత్రానికి ఆయన చివరిగా మాటలు రాశారు. కృష్ణ నటించిన సింహాసనం చిత్రంలో మహారథి కీలక పాత్ర పోషించారు. రైతు భారతం అనే సినిమాను మహారథి స్వయంగా నిర్మించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment