హైదరాబాద్,డిసెంబర్ 31: పోలీసుశాఖ వార్షిక నివేదిక వివరాలను మీడియాకు వెల్లడిస్తూ డీజీపీ దినేశ్ రెడ్డి మహిళల వస్త్రధారణ పై చేసిన కామెంట్ వివాదానికి కారణమైంది. అత్యాచారాలు పెరగడానికి మహిళల వస్త్రధారణ కూడా ఒక కారణమని డీజీపీ పేర్కొన్నారు. "నేరాల తీరును విశ్లేషిస్తే... మహిళలు పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం కూడా అత్యాచారాలకు ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సల్వార్ కమీజ్, చుడీదార్లు వచ్చాయి. ఆధునిక వస్త్రధారణలో భాగంగా ధరిస్తున్న దుస్తులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. ఇది నేర విశ్లేషణలో వెల్లడైన విషయం'' అని డీజీపీ తెలిపారు. ఇదే సందర్భంగా "నేరాల తీరును విశ్లేషిస్తే... మహిళలు పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం కూడా అత్యాచారాలకు కారణమని తెలుస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సల్వార్ కమీజ్, చుడీదార్లు వచ్చాయి. ఆధునిక వస్త్రధారణలో భాగంగా ధరిస్తున్న దుస్తులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. ఇది నేర విశ్లేషణలో స్ప ష్టమైన విషయం'' అని డీజీపీ తెలిపారు. ఏటేటా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, వారి వేష ధారణ ను కించపారచడం తమ ఉద్దేశం కాదని అన్నారు. కాగా.. దినేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించడంతో... డీజీపీ కార్యాలయం దీనిపై వివరణ మరింత ఇచ్చింది. నేటి ఆధునికపోకడల్లో భాగంగా మహిళలు ధరిస్తున్న వస్త్ర ధారణను నియంత్రించడం పోలీసుల బాధ్యత కాదని , డీజీపీ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం, డీజీపీ వ్యక్తిత్వం గురించి తెలిసిన మహిళలు సైతం ఆయనను విమర్శిస్తూ మాట్లాడటం విచారకరమని ఆ వివరరణలో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ దాక చేరిన డి.జి.పి. కామెంట్స్ పై కేంద్ర హోం మంత్రి చిదంబరం కూడా ఘాటు గానే స్పందించారు. డీజీపీ ప్రకటనతో తీవ్రంగా విభేదిస్తున్నామని, సమయం, సందర్భాన్ని బట్టి ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకోవచ్చునని . అది వారి వ్యక్తిగత ఇష్టాల ఇష్టాలకు సంబంధించిన విషయమని దీనిపై పోలీసులు జోక్యం అనవసరమని అన్నారు. టెన్నిస్ లేదా ఫుట్బాల్ ఆడేటప్పుడు పైనుంచి కిందిదాకా దుస్తులు వేసుకోరు కదా! అలాగే... ఏ కాక్టైల్ పార్టీకో వెళ్తున్నప్పుడు స్విమ్ సూటూ వేసుకోరు'' అని చిదంబరం సెలవిచ్చారు. గతంలో కెనడాకు చెందిన ఓ కానిస్టేబుల్ 'వేశ్యల్లాగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకుంటే... అత్యాచారాలు ఎందుకు జరగవు?' అని చేసిన వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'స్లట్ వాక్' అనే ఉద్యమానికి దారి తీసింది. కెనడా కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యపై మహిళల నుంచి నిరసన మాత్రమే కాదు... ధిక్కారం కనిపించింది. 'మా దుస్తులు, మా ఇష్టం! మధ్యలో మీ కేం సంబంధం' అంటు యువతీ లోకం నినదించింది. 'మగాడి బుద్ధి వంకరైతే.... మేం ముసుగు వేసుకుని తిరగాలా?' అని ప్రశ్నించారు. 'మారాల్సింది మా దుస్తులు కాదు. మీ ఆలోచనలు' అని సూచించారు. మన దేశంలో... ఢిల్లీ, భోపాల్ తదితర నగరాల్లోనూ ఈ 'స్లట్ వాక్స్' జరిగాయి. భోపాల్ లో 'బేషరమీ మోర్చా' అనే సంఘం కూడా ఏర్పడింది. స్లట్ వాక్ ఉద్యమంలో భాగంగా దేశ విదేశాల్లో అనేక ఆసక్తికరమైన నినాదాలు పుట్టుకొచ్చాయి.'భారతదేశం మనది.. అమ్మాయిలు, అబ్బాయి సమానం' అని ఒకరు ప్లకార్డ్స్ ప్రదర్శించగా... 'గ్రేప్స్ తినండి. రేప్స్ మానండి' అని మరోచోట నినదించారు. 'అమ్మాయంటే నీ అబ్బ సొత్తు కాదు'... అని ఇంకోచోట కన్నెర్ర చేశారు. 'నేనేం వేసుకున్నా, నేనేం చేసినా... అది నా ఇష్టం. నన్ను ముట్టుకునే అధికారం నీకు లేదు' అని మరో యువతి నినదించింది. భారత జట్టు క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల ప్రదర్శన చేస్తానన్న పూనం పాండేకూడా స్లట్ వాక్కు పూర్తి మద్దతు ప్రకటించింది కదా. .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment