హైదరాబాద్ ,డిసెంబర్ 28: లోగడ తీవ్ర సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యూష ప్రియుడిగా భావించిన సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు విధించిన శిక్షాకాలాన్ని హైకోర్టు తగ్గించింది. ప్రత్యూష 2002లో మరణించింది. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష కూల్ డ్రింకులో విషం కలుపుకుని సేవించారని, దాని వల్ల ప్రత్యూష మరణించిందని వార్తలు వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన సిద్ధార్థ రెడ్డి మాత్రం బతికి బయటపడ్డారు. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి ఆరేళ్ల కారాగారవాసాన్ని విధించింది. దీనిపై సిద్దార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్లాడు. సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి కోర్టు విధించిన ఆరేళ్ల శిక్షా కాలాన్ని హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది. రూ. 50 వేల జరిమానా విధించింది. ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి బెయిల్పై బయటే ఉన్నాడు. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలులో గడిపాడు. ప్రత్యూష తల్లి సరోజిని -హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ,హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెడతానని చెప్పారు
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment