హైదరాబాద్,అక్టోబర్ 2: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. సంప్రదింపుల పేరుతో ఇన్నాళ్లుగా నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరులకు నిరసనగా.. పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వేలాది మంది నాయకులు, అనుచరులతో కలిసి వచ్చిన కోమటిరెడ్డి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిసి మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. తెలంగాణ సాధన కోసమే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని, వెంటనే ఆమోదించాలని రాజీనామా పత్రంలో కోరారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ వద్దకు వచ్చి శాసనసభ కార్యదర్శి ఎస్.రాజసదారాంను కలిసి శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. కోమటిరెడ్డితోపాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ నెలాఖరులోపు తెలంగాణపై తేల్చకుంటే తన పదవులకు రాజీనామా చేస్తానని మూడు నెలల కిందటే ప్రకటించానని.. ఆ మాటకు కట్టుబడే రాజీనామా చేశానని కోమటిరెడ్డి చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment