Monday, October 17, 2011

మనకే ఈ అలెర్జీ ...!

న్యూఢిల్లీ,అక్టోబర్ 17:  భారత్‌లో  అలెర్జీ సంబంధ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 20 నుంచి 30 శాతం మంది భారతీయులు ఏదో ఓ అలె ర్జీతో బాధపడుతున్నారు. పారిశ్రామికీకరణ పెరగడం, వేగంగా మారిపోతున్న జీవవైవిధ్యాలకు శ్రమరహిత జీవనశైలి కూడా తోడవుతుండటం వల్లే భారతీయుల్లో ముఖ్యంగా పిల్లల్లో అలెర్జీలు అధికమవుతున్నాయని వరల్డ్ అలెర్జీ ఆర్గనైజేషన్  వెల్లడించిమి. అలెర్జీల బారినపడుతున్న భారతీయుల్లో అత్యధికులు ఉబ్బసం, చర్మ సమస్యలు, ఆహారం, ఔషధా లు పడకపోవడం, నంజురోగం వంటి సమస్యలతో బాధపడుతున్నారని  సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. 1964తో పోల్చితే ప్రస్తుతం దేశంలో అలెర్జీలు 10 శాతం వేగంతో వ్యాప్తిచెందున్నాయని  సంస్థ తెలిపింది.  2050 నాటికి 50 శాతం మంది భారతీయ చిన్నారులు అలెర్జీల బారినపడే ప్రమాదముందని టోక్యోలోని డబ్ల్యూఏఓ అధ్యక్షురాలు, భారతీయ వైద్యురాలు  రూబీ పవాంకర్ వెల్లడించారు. పట్టణీకరణ, కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరగడం కూడా అలెర్జీలకు కారణమవుతున్నాయి. అయితే మనం పీల్చుకునే గాలే మన ఆరోగ్యాన్ని శాసిస్తోందని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యుడు హేమంత్ తివారీ అన్నారు. ఇళ్లలోకి స్వచ్ఛమైన గాలి ప్రవేశించేందుకు వీల్లేకుండా పోయినందునే అలెర్జీలు పెరుగుతున్నాయన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, పొగ తాగడం మానడం, అలెర్జీ కారకాల నిర్మూలన తదితర ప్రమాణాలు పాటిస్తే అలెర్జీలకు చెక్‌పెట్టవచ్చని ఆయా దేశాలకు డబ్ల్యూఏ. ఓ సూచించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...