' బంద్ ' ల కోదండరాం...!
హైదరాబాద్,అక్టోబర్ 16: తెలంగాణ ఉద్యమంపై పోలీసుల వైఖరి, అరెస్టులకు నిరసనగా సోమవారం తెలంగాణ బంద్కు రాజకీయ జేఏసీ పిలుపు ఇచ్చింది. రైల్రోకోకూడా కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలిపారు. సకల జనుల సమ్మె ఆగబోదని, తెలంగాణ వచ్చేదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. సకల జనులసమ్మెలో భాగంగా ఉద్యమ రూపాలను మారుస్తున్నామని, జేఏసీ సమావ్రశంలో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కోదండ రాం చెప్పారు.
Comments