Saturday, October 1, 2011

అరసవల్లిలో అద్భుతం

 శ్రీకాకుళం,అక్టోబర్ 1:  శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అనివారం  ఉదయం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ ను తాకాయి. భానుని కిరణాలు స్వామివారి పాదాలపై పడటంతో ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తులు పరవశించారు. అరుదుగా సంభవించే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  ప్రతి ఏడాది మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్య కిరణాలు మూలవిరాట్ ను తాకుతాయి. అయితే ఈసారి మాత్రం రెండేళ్ల తర్వాత ఈ అద్భుతం చోటుచేసుకుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...