Thursday, September 29, 2011

రెండు రాష్ట్రాలు - రెండు రాజధానులు...?

ఇదేనా కేంద్రం ఫార్ములా...!  
హైదరాబాద్ ,సెప్టెంబర్ 29: తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర విభజనకు కొత్త ఫార్ములాను తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ను  రెండుగా విడగొట్టి కొద్ది కాలం హైదరాబాదునే ఇరు ప్రాంతాలకు రాజధాని గా వంచి,  రెండు రాష్ట్రాలూ  ఆయా రాజధానులను ఏర్పాటు చేసుకున్న అనంతరం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి తెలంగాణ, సీమాంధ్రులు ఒప్పుకోని పక్షంలో ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన విధించే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.  ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోక పోయినా రెండు రాష్ట్రాలు - రెండు రాజధానులు అనే సూత్రంతో కేంద్రం ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...