న్యూఢిల్లీ,జూన్ 26: : డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇంధనధరలను పెంచడం ద్వారా సామాన్యులపై యూపీఏ సర్కారు పెనుభారం మోపిందంటూ బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్వాదీ పార్టీ సైతం ఇంధన ధరలు పెంచడాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఇంధన ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలంటూ కాంగ్రెస్ అధిష్టానం తమ పాలనలో ఉన్న రాష్ట్రాలను కోరింది. ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండు చేస్తూ శనివారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ వామపక్షాలు తమ శాఖలన్నింటికీ పిలుపునిచ్చాయి. డీజిల్ ధరలను పెంచడం ద్వారా రవాణాపై భారం పడుతుందని, దీనివల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతాయని సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పేర్కొన్నాయి.
మళ్ళి మంట...?
తాజాగా దీజిల్ ధరను లీటర్ రు.3.కిరోసిన్ ధరను రు. లీటర్ 2,వంట గ్యాస్ ధరను రు. 50 పెంచినా కేంద్ర దాహం ఇంకా తీరలేదు. వంటగ్యాస్, కిరోసిన్ ధరలను వీలైనంత త్వరలో మళ్లీ భారీగా పెంచే దిశగా పావులు కదుపుతోంది. ఈసారి గ్యాస్ సిలిండర్పై మరో రూ.50, కిరోసిన్పై లీటరుకు ఏకంగా రూ.4 చొప్పున వడ్డించనున్నట్టు సమాచారం! పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన సూచనలను కేంద్రం వరుసగా అమలు చేస్తున్న తీరును, 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష నిర్ణయాలను చూసినా... పెట్రోలియం మంత్రి జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనించినా తలసరి వ్యవసాయాదాయ వృద్ధి రేటు ఆధారంగా ఇకపై ఏటా క్రమం తప్పకుండా కిరోసిన్ ధరను పెంచనున్నారని తెలుస్తోంది. దాంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కిరోసిన్ కోటాకు ప్రణాళికా సంఘం ‘సూచన’ల ప్రకారం 20 శాతం మేర కోత విధిస్తారని, లబ్ధిదారుల సంఖ్యను కూడా వీలైనంతగా కుదిస్తారని సమాచారం. నిజానికి వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 , కిరోసిన్పై లీటర్కు రూ.6 పెంచాలని గతేడాది 11వ పంచవర్ష ప్రణాళిక అమలు మధ్యంతర సమీక్ష సందర్భంగా గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దాని అమలుకు అదను కోసం ప్రభుత్వం వేచి చూస్తూ వచ్చింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్పై రూ.50, కిరోసిన్పై లీటర్కు రూ.2 పెంచడం అందులో భాగమే. దానికి కొనసాగింపుగా బ్యాలెన్సు బాదుడు వీలైనంత త్వరలో ఉంటుందని తెలుస్తోంది.
మళ్ళి మంట...?
తాజాగా దీజిల్ ధరను లీటర్ రు.3.కిరోసిన్ ధరను రు. లీటర్ 2,వంట గ్యాస్ ధరను రు. 50 పెంచినా కేంద్ర దాహం ఇంకా తీరలేదు. వంటగ్యాస్, కిరోసిన్ ధరలను వీలైనంత త్వరలో మళ్లీ భారీగా పెంచే దిశగా పావులు కదుపుతోంది. ఈసారి గ్యాస్ సిలిండర్పై మరో రూ.50, కిరోసిన్పై లీటరుకు ఏకంగా రూ.4 చొప్పున వడ్డించనున్నట్టు సమాచారం! పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన సూచనలను కేంద్రం వరుసగా అమలు చేస్తున్న తీరును, 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష నిర్ణయాలను చూసినా... పెట్రోలియం మంత్రి జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనించినా తలసరి వ్యవసాయాదాయ వృద్ధి రేటు ఆధారంగా ఇకపై ఏటా క్రమం తప్పకుండా కిరోసిన్ ధరను పెంచనున్నారని తెలుస్తోంది. దాంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కిరోసిన్ కోటాకు ప్రణాళికా సంఘం ‘సూచన’ల ప్రకారం 20 శాతం మేర కోత విధిస్తారని, లబ్ధిదారుల సంఖ్యను కూడా వీలైనంతగా కుదిస్తారని సమాచారం. నిజానికి వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 , కిరోసిన్పై లీటర్కు రూ.6 పెంచాలని గతేడాది 11వ పంచవర్ష ప్రణాళిక అమలు మధ్యంతర సమీక్ష సందర్భంగా గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దాని అమలుకు అదను కోసం ప్రభుత్వం వేచి చూస్తూ వచ్చింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్పై రూ.50, కిరోసిన్పై లీటర్కు రూ.2 పెంచడం అందులో భాగమే. దానికి కొనసాగింపుగా బ్యాలెన్సు బాదుడు వీలైనంత త్వరలో ఉంటుందని తెలుస్తోంది.
No comments:
Post a Comment