Tuesday, March 22, 2011

దీక్ష విరమించిన రాఘవులు

హైదరాబాద్,మార్చి 22:  ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గత ఆరు రోజులుగా  జరుపుతున్న నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పితాని సత్యనారాయణ, పసుపులేని బాలరాజు ఇచ్చిన హామీతో ఆయన మంగళవారం మధ్యాహ్నాం దీక్షను విరమిస్తున్నట్లు వెల్లడించారు.  ఆరోగ్యం క్షీణించటంతో ఆయనను రెండురోజుల  క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో కూడ దీక్ష కొనసాగించిన రాఘవులు తో ప్రభుత్వం  రెండు విడతలుగా జరిపిన చర్చల అనంతరం ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ మంత్రులు హామీలు మాత్రమే ఇచ్చారని, దీంతో అన్ని సమస్యలు పరిష్కారమైనట్లు కాదని అన్నారు. తమ ఉద్యమం కొంతమేర విజయవంతం అయిందని ఆయన అన్నారు. సమస్యలపై మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యమం ఒక అడుగు ముందుకు వేసిందన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...