న్యూఢిల్లీ,మార్చి 8: తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, డిఎంకెల మధ్య ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు కేటాయించడానికి డిఎంకె అంగీకరించింది. ఈ రెండు పార్టీల మధ్య మూడు రోజుల నుంచి చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే 15 స్థానాలు అదనంగా పొందింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, కేంద్ర మంత్రి అళగిరి, కరుణానిధి మేనల్లుడు, కేంద్ర మంత్రి దయానిధి మారన్'ల మధ్యన జరిగిన చర్చలలో సీట్ల ఒప్పందం కుదిరింది. డిఎంకె 61 స్థానాలను ఇవ్వడానికి అంగీకరించింది. మరో రెండు స్థానాలను మిత్ర పక్షాల నుంచి ఇప్పిస్తామని డిఎంకె హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదట 60 స్థానాలను కోరింది. డిఎంకె 60 స్థానాలను ఇవ్వడానికి అంగీకరించిన తరువాత 63 స్థానాలను కోరింది. దాంతో ఇరు పార్టీల మధ్య వ్యవహారం బెడిసి కొట్టింది. దాంతో చర్చలు మొదలయ్యాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి కోరిన విధంగా 63 స్థానాలను పొందింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment