వేద పండితులకు టిటిడి ఆయుష్మాన్ భవ
తిరుపతి,మార్చి 8: వేద పండితుల పేరిట ఆయుష్మాన్ భవ ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు టిటిడి ప్రకటించింది. మంగళవారం జరిగిన టిటిడి వేద సమ్మేళనంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వేదపండితుల భార్యలకు అయిదు వేల రూపాయల వితంతు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. వేద విద్యార్థుల పేరిట మూడు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు. వృద్ధ వేదపండితులకు 8 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు.
Comments