Tuesday, February 15, 2011

సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి మరణ శిక్ష

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15: నిథారీ హత్యల కేసులో సీరియల్ కిల్లర్ సురీందర్ కోలీకి సుప్రీంకోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. 2005లో జరిగిన పద్నాలుగేళ్ల బాలిక హత్య కేసులో అతడికి ఈ శిక్ష విధించింది.నిందితుడిపై ఎలాంటి దయా దాక్షిణ్యాలను ప్రదర్శించలేమని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞాన్‌సుధా మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిథారీలో 2005-06 మధ్య జరిగిన వరుస హత్యలు అత్యంత కిరాతకమైనవని, ఇవి అరుదైన వాటిలో అరుదైన కేసులని అభివర్ణిస్తూ, నిందితుడు సీరియల్ కిల్లర్‌గా స్పష్టమవుతోందని పేర్కొంది. నిథారీలో జరిగిన రింపా హల్దర్ అనే బాలిక హత్య కేసుపై ‘సుప్రీం’ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...