Tuesday, February 15, 2011

9.5 శాతం కానున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15:  ఉద్యోగులు తమ భవిష్యనిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 2010-11కి సంబంధించి, 1 శాతం అదనంగా, 9.5 శాతం పొందే అవకాశం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. దీనివల్ల 4.71 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు త్వరలో ఆర్థికశాఖ ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. ‘ఈపీఎఫ్‌పై 9.5 శాతం వడ్డీ రేటు ప్రతిపాదనపై ఆర్థికశాఖ కొన్ని వివరణలు కోరింది. కార్మికశాఖ వాటికి జవాబులు పంపింది’ అని ఖర్గే వివరించారు. 2005-06 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...