9.5 శాతం కానున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15:  ఉద్యోగులు తమ భవిష్యనిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 2010-11కి సంబంధించి, 1 శాతం అదనంగా, 9.5 శాతం పొందే అవకాశం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. దీనివల్ల 4.71 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు త్వరలో ఆర్థికశాఖ ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. ‘ఈపీఎఫ్‌పై 9.5 శాతం వడ్డీ రేటు ప్రతిపాదనపై ఆర్థికశాఖ కొన్ని వివరణలు కోరింది. కార్మికశాఖ వాటికి జవాబులు పంపింది’ అని ఖర్గే వివరించారు. 2005-06 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు