Tuesday, September 14, 2010

ప్రధాని పదవి ఒక్కటే కా దు. చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి:రాహుల్

శాంతినికేతన్ (పశ్చిమ బెంగాల్),సెప్టెంబర్ 14 : 'నేనే కనుక దేశ ప్రధానినైతే..' అని అంటూనే ఒక్క క్షణం ఆగి.. 'అయినా ప్రపంచంలో ప్రధాని పదవి ఒక్కటే కా దు. మనిషి చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రధాని అయ్యే అంశంపై శాంతినికేతన్ విద్యార్థులు తనను అడిగిన ప్రశ్నకు.. 40 ఏళ్ల రాహుల్ సమాధానాన్ని చెప్పినట్లే చెప్పి.. అంతలోనే దాటవేశారు. యువతతో మమేకమయ్యేందుకు దేశవ్యాప్తంగా తాను చేపడుతున్న పర్యటనల్లో భాగంగా రాజీవ్‌గాంధీ తనయు డు శాంతినికేతన్‌కు తొలిసారిగా వచ్చారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీలోని విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ప్రపంచంలో ప్రధాని పదవి ఒక్కటే లేదని.. వ్యక్తులు చేయగలిగిన పనులు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు.'ప్రధాని కావడమే ఏకైక లక్ష్యంగా ఉండ కూడదు. దేశానికి మరెన్నో రకాలుగా కూడా మనం సేవ చేయవచ్చు' అని చెప్పారు. శాంతినికేతన్ పర్యటన సందర్భంగా రాహుల్ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. బ్యారికేడ్లను దాటుకొని.. విశ్వభారతి విద్యార్థినులను సాదరంగా పలుకరించారు. వర్సిటీ భద్రతా సిబ్బంది యో గక్షేమాలూ తెలుసుకొన్నారు. కొందరు విద్యార్థుల భుజాలు చరుస్తూ.. వారి లో ఉత్సాహం నింపేందుకు యత్నించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ వారసు డి ఆటోగ్రాఫ్‌ల కోసం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. కాగా.. తన పర్యటన సందర్భంగా.. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లకు సంబంధించి ఓ ఎగ్జిబిషన్‌ను రాహుల్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఉంచిన తన తాత, నాయనమ్మ, తండ్రికి సంబంధించిన అరుదైన ఫోటోలను చూసి మురిసిపోయారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...