Tuesday, September 14, 2010

చంద్రబాబుకు తెలంగాణా సెగ

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్ 14: ఎరువుల కొరతపై ఉద్యమ శంఖం పూరించి, మహబూబ్‌నగర్‌లో ధర్నాకు బయలుదేరిన తెలుగుదేశం అధ్యక్షుడికి టీఆర్ఎస్ శ్రేణులు, ఏబీవీపీ నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో మొదలైన అడ్డంకులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ చేరేదాకా కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా పరిగి రణరంగంగా మారింది. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల వర్షం కురిసింది. దీంతో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పలుచోట్ల బాబు వాహనాలపై రాళ్లు పడ్డాయి. బాబు కాన్వాయ్‌పై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...