Thursday, September 23, 2010

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : అయోధ్యపై అహమ్మదాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు వెలువరించవలసిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయవలసిందిగా గురువారం నాడు కోర్టు ఆదేశించింది. జస్టిస్ రవీంద్రన్, జస్టిస్ గోఖలే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్టే ఇచ్చింది. అయోధ్య వివాదంతో సంబంధం ఉన్న అందరికీ సుప్రీమ్ కోర్టు గురువారమే నోటీసులు జారీ చేసింది. శుక్రవారంనాడు అహమ్మదాబాద్ హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నా అందరూ సంయమనం పాటించాలని దేశవ్యాప్తంగా ఇటు హిందూ మత పెద్దలు, అటు ముస్లిం మత పెద్దలు, రాజకీయ నాయకులు తమ అనుయాయులకు విజ్ఞప్తి చేయగా, ఇదే సమయంలో ఆ తీర్పు ప్రకటనను వారం రోజులు వాయిదా వేయవలసిందిగా సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.అయోధ్యపై తీర్పును వాయిదా వేయవలసిందిగా గతంలో అహమ్మదాబాద్ హైకోర్టును ఆశ్రయించిన రమేష్ చంద్ర త్రిపాఠే ఈసారి కూడా సుప్రీమ్ కోర్టును కూడా ప్రజాప్రయోజనాల వాజ్యం రూపంలో ఆశ్రయించారు. అహమ్మదాబాద్ హైకోర్టు అయోధ్యపై తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు పర్యవసానంగా దేశంలో ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే అది ప్రపంచం దృష్టిని విధిగా ఆకర్షిస్తుందని, మరీ ముఖ్యంగా త్వరలో ఢిల్లీలో కామన్‌వెల్త్ క్రీజలు జరుగనున్న సందర్భంలో ఇటువంటి పరిణామాలు దేశానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని పిటిషనర్ వాదించారు. అలాగే అసలు వివాదంపై ఉభయపక్షాల మధ్య కోర్టు వెలుపల పరిష్కారం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని, అందువల్ల ఈ తీర్పును వాయిదా వేయవలసిందిగా అహమ్మదాబాద్ హైకోర్టుకు సూచించాలని పిటిషనర్ కోరారు.పిటిషనర్ వాదన విన్న సుప్రీమ్ కోర్టు వారం రోజుల పాటు తీర్పు ప్రకటనను వాయిదా వేయాలని అహమ్మదాబాద్ హైకోర్టుకు సూచించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 28 వ తేదీన సుప్రీమ్ కోర్టు విచారణ చేపట్టనున్నది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...