Wednesday, September 15, 2010

అమితాబ్ కు మూడవసారి ఉత్తమ జాతీయ నటుని అవార్డ్


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: 57వ జాతీయ చలన చిత్ర అవార్డ్ లను ప్రకటించారు. కలెక్షన్ల రికార్డులను తుత్తునియలు చేసిన తెలుగు 'మగధీర' రెండు జాతీయ అవార్డులు సాధించింది. ఈ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్నన్, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన శివశంకర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. మలయాళ చిత్రం 'కుట్టి శ్రాంక్' జాతీయ ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దుస్తుల అవార్డులతోపాటు న్యాయ నిర్ణేతల ప్రత్యేక గుర్తింపు పురస్కారాన్ని కూడా సాధించింది. 'పా' చిత్రంలో శారీరక, మానసిక వికలాంగుడి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను అచ్చెరువొందించిన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకోవడం అమితాబ్‌కు ఇది మూడోసారి. గతంలో అగ్నిపథ్, బ్లాక్ సినిమాలు ఆయనకు ఈ అవార్డును అందించాయి. ఉత్తమ హిందీ చిత్రంగా కూడా 'పా' ఎన్నికైంది.బెంగాలీలో 'అబోహోమన్' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రీతూపర్ణా ఘోష్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సాధించారు. ఇదే చిత్రంలో అసమాన్య ప్రతిభ కనబరచిన నటి అనన్యా ఛటర్జీ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, కన్నీళ్లు తెప్పించే భావోద్వేగం, ఆలోచింపచేసే నేపథ్యంతో ఆబాలగోపాలాన్ని అలరించిన 'త్రీ ఈడియట్స్' అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా విజయ కేతనం ఎగురవేసింది. శ్యామ్ బెగనల్ రూపొందించిన 'వెల్‌డన్ అబ్బా' ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికైంది. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన 'ఢిల్లీ 6' ఉత్తమ సామాజిక సమైక్యతా చిత్రం అవార్డు గెలుచుకుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...